ఎన్నడూ రాని కాంగ్రెసోళ్లు పబ్లిసిటీ కోసం రాద్ధాంతం చేస్తున్నారు అంబేద్కర్ నగర్ వాసులు
హన్మకొండ, ఏప్రిల్ 11: ‘ఆపదలో ఉన్నప్పుడు ఎన్నడూ రాని కాంగ్రెస్ వాళ్లు పబ్లిసిటీ కోసం మమ్మల్ని వాడుకుంటున్నారని’ హన్మకొండలోని ఏషియన్ మాల్ సమీపంలో గల అంబేద్కర్నగర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ‘మాకు ఆపద వచ్చినప్పుడు ఏరోజూ కనిపించని కాంగ్రెసోళ్లు ఆదివారం అంబేద్కర్నగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని అనవసరంగా ఇళ్లలోకి చొరబడి రాద్ధాంతం చేస్తున్నారని’ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ఎప్పటికప్పుడు డబుల్ బెడ్రూం ఇళ్ల సమాచారాన్ని మాకు అందిస్తున్నారన్నారు. సాంకేతిక సమస్య ఉన్నందున సోమవారం వరంగల్ పర్యటనకు వస్తున్న మంత్రి కేటీఆర్ ప్రారంభించడం లేదన్నారు. త్వరలోనే లబ్ధిదారులకు ఇండ్లు అప్పగిస్తుందని మాకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని’ అన్నారు. అంబేద్కర్నగర్ వాసులు ఎవ్వరు లేకుండా కేవలం వారి రాజకీయ లబ్ధికోసం ఇతర ప్రాంతాల వారిని తీసుకొచ్చారని తెలిపారు. కార్యక్రమంలో అంబేద్కర్నగర్ వాసులు సౌరం రఘు, చంద్రమౌళి, రమేశ్, స్వామి, సాయి, రమేశ్, మన్నెమ్మ, శోభ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
కోల్కతా ఓపెనర్ల ధనాధన్.. రాణా హ్యాట్రిక్ ఫోర్లు
వడ్లకొండలో సంపూర్ణ మద్యపాన నిషేధం