గజ్వేల్ అర్బన్/వర్గల్/మర్కూక్, ఏప్రిల్7: ‘గలగ లా గోదావరి పరుగులిడుతుంటే’.. అని అప్పుడెప్పుడో మనం పాడుకున్న పాట.. ఇప్పుడు మన తెలంగాణ రా ష్ట్రంలో నిజమవుతున్నది. మంగళవారం గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్ మండలం అవుసుల పల్లి వద్ద హల్దీవాగులోకి, పాములపర్తి వద్ద గజ్వేల్ కెనాల్లోకి సీఎం కేసీఆర్ విడుదల చేయడంతోనే గోదావరి జలాలు పరుగుపరుగున చెరువుల్లోకి పారుతున్నాయి. అవుసులపల్లి వద్ద సంగారెడ్డి కెనాల్ నుంచి ఆఫ్ టెక్ ద్వారా బంధంచెరువులోకి విడుదల చేసిన నీటితో 24గంటల్లో సరిగ్గా బుధవారం 11గంటలకు బంధంచెరువు పూర్తిగా నిం డి, మత్తడి దూకింది. మత్తడి దూకిన గోదావరి జలాలు కాలువ ద్వారా పెద్దచెరువులోకి చేరుకుంటున్నాయి. బుధవారం రాత్రి వరకు వర్గల్ పెద్ద చెరువు కూడా పూర్తి నిండి, శాకారం ధర్మాయచెరువులోకి నీరు వెళ్లనున్నాయి.
బంధం చెరువులో 14 మెట్రిక్క్యూబిక్ ఫీట్ల నీరు నిల్వ సామర్థ్యం కాగా, చెరువు కింద 150ఎకరాల ఆయకట్టు ఉంది. వర్గల్ పెద్ద చెరువులో 12మెట్రిక్ క్యూబిక్ ఫీట్ల సామర్థ్యం కాగా, 140ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఈ రెండు చెరువులు నిండడంతో 290ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వచ్చింది. అలాగే గజ్వేల్ కెనాల్ ద్వారా పాములపర్తి రెడ్డికుంట నిండి పెద్దచెరువులోకి నీరు పారుతున్నాయి. శుక్రవారం పెద్దచెరువు నిండి, పటేల్కుంటలోకి కుంటలోకి అలుగుపారే అవకాశముంది. కాగా, రెడ్డికుంటలో 2.17మెట్రిక్ క్యూబిక్ ఫీట్ల నీటి నిల్వ సామర్థ్యముండగా, ఈ కుంట కింద 13ఎకరాల ఆయకట్టు ఉన్నది. పాముల పెద్దచెరువులో 29.34 మెట్రిక్ క్యూబిక్ ఫీట్ల సామర్థ్యం ఉండగా, 176.06 ఎకరాల ఆయకట్టు ఉన్నది. గజ్వేల్ కెనాల్లోని లోని గోదావరి జలాలు ప్రజ్ఞాపూర్, ముట్రాజ్పల్లి, సంగాపూర్ వరకు చేరుకున్నాయి. గజ్వేల్ కెనాల్ నుండి ప్రజ్ఞాపూర్ ఊర చెరువులోకి నీటిని విడుదల చేస్తున్నారు.
మురుస్తున్న రైతులు
సంగారెడ్డి కెనాల్ ఆఫ్టెక్ ద్వారా విడుదల చేసిన నీటితో వర్గల్ మండలం చౌదరిపల్లి బంధం చెరువు నిండి అలుగు పారుతుంటే వృద్ధులు, మహిళలు, చిన్నారులంతా చెరువు నీటిని చూసి సంబురపడుతున్నారు. ఒకవైపు రోళ్లు పగిలేలా ఎండలు కొడుతుంటే, మరోవైపు చెరువులో గోదావరి జలాలు నిండి పారుతుండడం చూసి అన్నదాతల ఆనందం ఆకాశాన్నంటుతున్నది. బంధంచెరువు అలుగుపారగానే రైతులతో కలిసి నాచారం లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ సభ్యుడు పడిగె రాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగరాజులు గోదావరి జలాలకు పసుపు, కుంకుమ,పువ్వులు సమర్పించారు. రైతులంతా జైకేసీఆర్, జైతెలంగాణ అంటూ నినాదాలు చేశారు.
ఇవీ కూడా చదవండీ…
‘పుష్ప’తో గుర్తుండిపోయే బహుమతి ఇచ్చారు
చైతన్య యూనివర్సిటీలో బ్యాటరీ కారు..
రైతుల శ్రేయస్సుకే ధాన్యం కొనుగోలు