భీమారం, ఏప్రిల్ 5: అణగారిన వర్గాల అభ్యున్నతికి పోరాటాలు చేసిన యోధుడు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ అని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే పురుషోత్తం అన్నారు. జగ్జీవన్ రామ్ జయంతిని కేయూలోని ఆయన విగ్రహానికి పురుషోత్తంతోపాటు కేయూ పాలకమండలి సభ్యులు పీ మల్లారెడ్డి, టీ మనోహర్, ప్రొఫెసర్లు బన్న అయిలయ్య, రామచంద్రం, డాక్టర్ సంగాని మల్లేశ్వర్ పూలమాలలు వేసి, నివాళులర్పించారు. కేయూ ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రిజిస్ట్రార్ మాట్లాడుతూ జగ్జీవన్రామ్ అంటరానితనంపై అలుపెరుగని పోరాటం చేశారన్నారు. వివిధ కార్మిక చట్టాలు, సంక్షేమ పథకాల రూపకల్పనలో ఆయన పోషించిన పాత్ర మరువలేనిదన్నారు.
‘మట్టి బంధం’ పుస్తకావిష్కరణ
బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని దళిత మహిళా పరిశోధకురాలు డాక్టర్ తాళ్లపల్లి యాకమ్మ రచించిన ‘మట్టి బంధం’ 94 కవితల సంపుటిని కేయూలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పురుషోత్తం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ వెంకటరాంరెడ్డి, డాక్టర్ వై వెంకయ్య, డాక్టర్ శ్రీనివాస్రావు, డాక్టర్ హనుమంతు, డాక్టర్ పుల్లా శ్రీనివాస్, డాక్టర్ కొట్టె భాస్కర్, పెండ్లి అశోక్ బాబు, డాక్టర్ శంకరయ్య, డాక్టర్ అరూరి సూర్యం, మంద వీరస్వామి, డాక్టర్ నల్లాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నిట్లో..
కాజీపేట : నిట్ ఇంజినీరింగ్ కళాశాలలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశం గర్వించదగిన ముద్దుబిడ్డ బాబూ జగ్జీవన్ రామ్ అన్నారు. ఆయన కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు కనీస వేతనం, కనీస పని గంటలు ప్రతిపాదించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ గోవర్ధన్రావు, కన్నా రమేశ్, ప్రోగ్రాం డీన్లు, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యుత్ భవన్లో..
వరంగల్ సబర్బన్ : స్వాతంత్య్ర ఉద్యమంలో గొప్ప పోరాట యోధుడిగా బాబూ జగ్జీవన్రామ్ నిలిచారని ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్రావు అన్నారు. నక్కలగుట్టలో ని విద్యుత్ భవన్లో సోమవారం జగ్జీవన్రామ్ చిత్రపటానికి సీఎండీతోపాటు డైరెక్టర్లు వెంకటేశ్వర్రావు, నర్సింగారావు, సంధ్యారాణి, మోహన్రెడ్డి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ జగ్జీవన్రామ్ గొప్ప పరిపాలనా దక్షుడని కొనియాడారు. ఆయన జయంతిని దేశవ్యాప్తంగా సమతాదివస్గా జరుపుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో సీజీఎంలు కిషన్, సదర్లాల్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పారిశుద్ధ్య కార్మికుల జీతాలు పెంపు
కంటైన్మెంట్ జోన్గా జోధ్పూర్ ఐఐటీ