నారాయణఖేడ్, మార్చి 30 : నిరుపేదలకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 75 శాతం సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. మంగళవారం నారాయణఖేడ్ మండలం జగన్నాథ్పూర్లో ఎస్ఆర్డీపీ పథకం ద్వారా మంజూరైన 26 యూని ట్ల గొర్రెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేయడంతో గొల్లకుర్మల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. అనంతరం గొర్రెలకు టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామస్తులు ఎమ్మెల్యేను గొంగడితో సన్మానించి గొర్రె పిల్లను బహూకరించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల విజిలెన్స్ కమిటీ సభ్యుడు బసప్ప, బంజారా సేవాలాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్చౌహాన్, జుజాల్పూర్ సర్పంచ్ జైపాల్రెడ్డి, పశువైద్యాధికారి నేతాజీ, నాయకులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ నేతకు ఎమ్మెల్యే పరామర్శ..
అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణఖేడ్ జడ్పీటీసీ లక్ష్మీబాయి భర్త జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు రవీందర్నాయక్ను ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి పరామర్శించారు. పూర్తిగా కోలుకునే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత..
నారాయణఖేడ్లోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి సీఎం సహాయనిధి చెక్కులను బాధితులకు అందజేశారు.
ఇవీ కూడా చదవండి..
సాగర్లో జోరుగా టీఆర్ఎస్ ప్రచారం
ములుగు, నారాయణపేట జిల్లాల్లో పోస్టుల భర్తీకి ఆమోదం