మెదక్ : మురుగు కాల్వలో పడి గుర్తు తెలియని వ్యక్తి మరణించాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని రామాయంపేట పట్టణంలోని హీరోహోండా షోరూం సమీపంలో శుక్రవారం జరిగింది. వివరాలలోకి వెళ్తే..మూత్ర విసర్జనకు వెళ్లిన వ్యక్తి కాలుజారి కాల్వలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వయసు సుమారు (55) సంవత్సరాలు ఉంటుందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానలోని మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.