హాలియా, మార్చి 23: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ గెలుపు టీఆర్ఎస్దేనని రామగుండం ఎమ్మెల్యే, ఉప ఎన్నికల హాలియా మున్సిపాలిటీ ఇంచార్జి కోరుకంటి చందర్ అన్నారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో మంగళవారం సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ తీశారు. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు, స్థానిక టీఆర్ఎస్ నాయకులతో కలిసి దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. పింఛన్లు పెంచడంతోపాటు రైతులకు పెట్టుబడి సాయం, రైతుబీమా, 24 గంటల విద్యుత్ అందిస్తూ వ్యవసాయాన్ని పండుగ చేశారని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలువడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్లో చేరికలు..
గుర్రంపోడు, మార్చి 23 : నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని గుర్రంపోడు మండ లం లక్ష్మీదేవిగూడెం, బొల్లా రం, ఆములూర్, చామలేడు గ్రామాల్లో కాంగ్రెస్కు చెందిన పలువురు నల్లగొండ ఎమ్మెల్యే, ఉప ఎన్నికల మండల ఇంచార్జి కంచర్ల భూపాల్రెడ్డి సమక్షంలో మంగళవారం టీఆర్ఎస్లో చేరారు. మాడ్గులపల్లి మండలం ఇందుగుల గ్రామ ఉప సర్పంచ్ గవ్వ మమత కూడా కాంగ్రెస్కు రాజీనామా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ గూటికి చేరారు.