ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో నిర్వహణ
నేడు నియోజకవర్గ స్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక
సూర్యాపేట టౌన్, మార్చి 20: గుంటకండ్ల సావిత్రమ్మ మెమోరియల్ ట్రస్టు (ఎస్ ఫౌండేషన్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలు శనివారం సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సూర్యాపేట ఎంపీపీ బీరవోలు రవీందర్ రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం ప్రారంభించారు. ముందుగా ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తయారు చేయించిన టీ షర్ట్లను క్రీడాకారులకు పంపిణీ చేశారు. అనంతరం మండల స్థాయిలో గ్రామాల వారీగా తరలివచ్చిన జట్లకు పోటీలు నిర్వహించారు. 18 జట్లు పోటీల్లో పాల్గొనగా ప్రథమ స్థానంలోఇమామ్పేట టీమ్, ద్వితీయ స్థానంలో నిలిచిన బాలెంల టీమ్, తృతీయ స్థానంలో తాళ్ల ఖమ్మంపహాడ్లు టీమ్లు నిలిచాయి.
ఈ సందర్భంగా ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడిభిక్షం మాట్లాడుతూ మంత్రి జగదీశ్రెడ్డి తన మాతృమూర్తి పేరుతో ఎస్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీనివాస్ నాయుడు, మాలి అనంతరెడ్డి, రమణారెడ్డి, సంతోష్రెడ్డి, సర్పంచులు, ఉప సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
చివ్వెంల: మున్సిపాల్టీ పరిధిలోని కుడకుడలో మండలస్థాయి కబడ్డీ పోటీలను ఎంపీపీ ధరావత్ కుమారిబాబూనాయక్ ప్రారంభించారు. ఈ పోటీల్లో మొత్తం పది గ్రామాల నుంచి 10 జట్లు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ చందుపట్ల పద్మయ్య, పీఈటీలు పాల్గొన్నారు.
ఆత్మకూర్.ఎస్: మండల కేంద్రంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను ఎంపీపీ మర్ల స్వర్ణలతాచంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులకు ఎస్ ఫౌండేషన్ టీషర్టులను అందజేశారు. మండలంలోని 30 గ్రామ పంచాయతీల నుంచి 20 జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నేరెళ్ల వెంకన్న, సర్పంచ్ తంగెళ్ల వీరారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ ముద్దం కృష్ణారెడ్డి, పీఏసీఎస్ పీఏసీఎస్ చైర్మన్ కొణతం సత్యనారాయణరెడ్డి, వైస్ చైర్మన్ బొల్లె జానయ్య, నాయకులు మర్ల చంద్రారెడ్డి, తూడి నర్సింహారావు, బెల్లంకొండ యాదగిరి, సర్పంచులు, ఎంపీటీసీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
పెన్పహాడ్: మండలంలోని అనంతారం ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మండల స్థాయి కబడ్డీ పోటీలను ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ మా మిడి అనితాఅంజయ్య ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ బైరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ మామిడి రేవతి, పొదిల నాగార్జున, మండాది నగేశ్, చైర్మన్లు వెన్న సీతారాంరెడ్డి, నాతాల జానకీరాంరెడ్డి, ఓర్సు నాగయ్య, చెన్ను శ్రీనివాస్రెడ్డి, దొంగరి యుగంధర్, మామిడి అంజయ్య, పాండు, పరంధాములు, కృష్ణారెడ్డి, సత్యనారాయణ, మస్తాన్ పాల్గొన్నారు.