బండ్లగూడ, మార్చి 16 : అప్పులపాలై.. ఆ అప్పులను తీర్చడానికి గతంలో పనిచేసిన సంస్థలో రూ.22లక్షలను దొంగిలించాడు.. ఈ కేసులో ప్రధాన నిందితుడితోపాటు సహకరించిన మరో నలుగురిని మైలార్దేవ్పల్లి పోలీసులు అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు. మంగళవారం స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్కుమార్ వివరాలు వెల్లడించారు. స్టేషన్ పరిధిలో నివాసం ఉండే మంకాల్ ప్రశాంత్ కాటేదాన్లోని ఓ సంస్థలో అకౌంటెంట్గా పనిచేసి ఇటీవల మానేశాడు. కరో నా, లాక్డౌన్ కారణంగా కాసినో ఆటకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో అప్పులు అయ్యాయి. ఆ అప్పులను తీర్చడం కోసం.. గతంలో పనిచేసిన సంస్థలో దొంగతనం చేయాలనుకున్నాడు. ఇందుకు ఆనంద్సింగ్, మహ్మద్ అబ్దుల్, శంకర్సింగ్, మహ్మద్ సఫరుల్లాషర్ఫీ సహాయం కోరాడు. అందరూ కలిసి ఆ కంపెనీలో చొరబడి రూ.22.3లక్షలను దొంగిలించారు. యజమాని అభిషేక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి.. ప్రశాంత్ను అదుపులోకి తీసుకొని విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడితోపాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకుని.. వారి నుంచి 16 లక్షల 59,600 నగదు, ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్ నర్సింహ, డీఐ రాజేంద్రగౌడ్, కుమార్గౌడ్తో పాటు క్రైం సిబ్బందిని ఏసీపీ అభినందించారు.