భువనేశ్వర్ : ఒడిశా అసెంబ్లీలో నిన్న ఆత్మహత్యాయత్నం చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే సుభాష్ పణిగ్రహి శానిటైజర్ సేవించి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుభాష్ మాట్లాడుతూ.. దియోఘర్లో వరి ధాన్యం సేకరణ జరగడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. 2 లక్షల క్వింటాల్ కంటే ఎక్కువ ధాన్యం అమ్ముడు పోలేదన్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకే శానిటైజర్ సేవించి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.