కోల్కతా: భారతీయ జనతా పార్టీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి మరోసారి నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్రమోదీ పెద్ద మాయగాడని మండిపడ్డారు. ఇవాళ చిన్సురాహ్ జిల్లాలోని హుగ్లీ నగరంలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడిన ఆమె.. బెంగాల్ రాష్ట్రాన్ని బెంగాల్ రాష్ట్రమే ఏలుతుందని, గుజరాత్ ఏలదని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీగాని, గుండాలకు గానీ బెంగాల్ను పాలించే అవకాశం దక్కదని ఆమె తేల్చిచెప్పారు.
‘బెంగాల్ను బెంగాల్ పరిపాలిస్తుంది. బెంగాల్ను పాలించే అవకాశం గుజరాత్కు రాదు. ప్రధాని నరేంద్ర మోదీకి రాదు. గూండాలకు రాదు’ అంటూ మమతాబెనర్జి ఆగ్రహం వ్యక్తంచేశారు. అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని బీజేపీ నేతలు తరచుగా టోలాబాజ్ (దోపిడీదారు) అంటూ విమర్శించడంపై కూడా మమతాబెనర్జి మండిపడ్డారు. మీరు మమ్మల్ని ఎప్పుడూ టోలాబాజ్ అని విమర్శిస్తుంటారు. కానీ నేను మిమ్మల్ని (బీజేపీ నేతలను) దంగాబాజ్ (విద్వేషకారులు), దందాబాజ్ (మాయగాళ్లు) అంటున్నా అని దుమ్మెత్తిపోశారు. అంతేగాక ప్రధాని నరేంద్రమోదీకి భవిష్యత్తులో ట్రంప్ కంటే ఘోరమైన గతి పడుతుందని మమత శాపనార్థాలు పెట్టారు.