మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 27: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి.. తెలంగాణ తొలి ఉద్యమకారుడు ఆ చార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలత అన్నారు. బాపూజీ జయంతిని పుస్కరించుకొని సోమవారం జడ్పీ కార్యాలయంలో బాపూజీ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో శైలేశ్, కార్యాలయ సూపరింటెండెంట్ మాణయ్య, సిబ్బంది ధనుంజయ్, రూపేశ్, రంగరావు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో …
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, హవేళీఘనపూర్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు దుర్గాసాయిలు, శంకర్గౌడ్, శ్రీశైలం, సంజీవ్ పాల్గొన్నారు.
పద్మాశాలి సంఘం ఆధ్వర్యంలో…
పద్మాశాలి సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాం దాస్ చౌరస్తాలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించారు.కార్యక్రమంలో ఆసంఘం పట్టణ అ ధ్యక్షుడు రాంచంద్రం, నాయకులు శ్రీధర్, శ్రీపాల్, జయరాములు, రమేశ్, విశ్వనాథం, విజయ్, వెంకటేశం, విఘ్నేశ్ పాల్గొన్నారు.
హవేళీఘనపూర్ ఎంపీడీవో కార్యాలయంలో
హవేళీఘనపూర్, సెప్టెంబర్ 27: మండల కేంద్రమైన హవేళీఘనపూర్ ఎంపీడీవో కార్యాలయంలో కొండా లక్ష్మణ్బాపూజీ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ అశ్వినీ తానాజీవాఖ్డే, ఎంపీడీవో శ్రీరామ్, ఎంపీవో ప్రవీణ్కుమార్, ఏపీవో రాజ్కుమార్, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మార్కండేయ ఆలయంలో
పెద్దశంకరంపేట, సెప్టెంబర్27:పెద్దశంకరంపేటలో నిర్వ హించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిలో ఎంపీపీ జంగం శ్రీనివాస్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీపంతులు, ఎంపీటీసీ సుభాశ్గౌడ్, మండల పద్మశాలి సం ఘం అధ్యక్షుడు కనకరాజు, నాయకులు సంతోశ్, పున్న య్య, పట్టణ పద్మశాలి సంఘం సభ్యులు మహంకాళి కృష్ణమూర్తి, తదితరులున్నారు.
చిన్నశంకరంపేటలో..
చిన్నశంకరంపేట,సెప్టెంబర్27:కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని చిన్నశంకరంపేటలోని తహసీల్దార్ కార్యాల యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వర్రావు, సిబ్బంది పాల్గొన్నారు.