దుబ్బాక, జూన్ 24 : దుబ్బాక అభివృద్ధిలో మరో కలికితురాయి చేరనున్నది. దుబ్బాకలో రూ.4కోట్లతో అధునాతన హంగులతో బస్ స్టేషన్ నిర్మాణం చేపట్టనున్నట్లు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు భారీ బడ్జెట్ బస్ స్టేషన్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఎంపీ తెలిపారు. నెలాఖరులో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ చేతుల మీదుగా బస్ స్టాండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. గురువారం సాయం త్రం దుబ్బాక విలేకరులతో ఫోన్ మాట్లాడారు శిథిలావస్థకు చేరిన దుబ్బాక బస్ స్టాండ్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, బస్ స్టాండ్ నిర్మాణానికి రూ.4 కోట్లు నిధులు కేటాయించినట్లు తెలిపారు. గతంలో తాత్కాలికంగా రూ.కోటి కేటాయించిన విషయం తెలిసిందే. మోడల్ బస్ స్టాండ్ నిర్మాణం చేపట్టేందుకు మరిన్ని నిధులు కేటాయించారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధునాతన హంగులతో బస్ స్టేషన్ భవన నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపా రు. ఇందుకు సంబంధించిన నమూనా చిత్రాలను విడుదల చేశారు. దుబ్బాకతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రయాణికుల సమస్యను పరిష్కరిచడమే గాక మెరుగైన వసతులు కల్పించే అవకాశం దక్కినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. బస్ స్టాండ్ నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ కృతజ్ఞతలు తెలిపారు.
సర్వ హంగులతో బస్ స్టాండ్ నిర్మాణం..
సర్వ హంగులతో బస్ స్టాండ్ భవనం నిర్మించనున్నట్లు ఎంపీ ప్రభాకర్ తెలిపారు. అధునాతన హంగులతో బస్ స్టేషన్ నిర్మించేందుకు ప్రైవేట్ సంస్థతో నమూనా చిత్రాలను తీయించినట్లు వివరించారు. ఎకరాకు పైగా విస్తీర్ణంలో ఉన్న బస్ స్టాండ్ స్థలంలో ఒక వైపు నుంచి బస్ వచ్చేందుకు, మరోవైపు నుంచి బస్ బయటకు వెళ్లేందుకు వసతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రయాణికుల వాహనాలకు పార్కింగ్ కో సం ప్రత్యేక మార్గం, మరోవైపు బస్ స్టాండ్ చేరుకున్న ప్రయాణికులకు అనుకూలంగా మరో మా ర్గం ఉంటుందన్నారు. బస్ ప్లాట్ వద్దకు చేరుకునేందుకు, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా బస్ ఎక్కేందుకు వీలుగా ప్లాట్ ఫారం నిర్మాణం, బస్ కోసం వేచి ఉండే ప్రయాణికులకు కూర్చిలు, తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో 346 చదరపు అడుగుల్లో గ్రౌండ్ ఫ్లోర్, 615 చదరపు అడుగుల స్థలంలో ఫస్ట్ ఫ్లోర్ భవనాలు నిర్మిస్తున్నట్లు వివరించారు. బస్ స్టాండ్ నిర్మాణానికి రూ.4కోట్లు సరిపోకపోతే మరిన్ని నిధులు మం జూరు చేసేందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని తెలిపారు.