చిలిపిచెడ్, సెప్టెంబర్ 21: చిలిపిచెడ్ మండలంలో పలువురు టీఆర్ఎస్ కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైనట్లు మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు అశోక్రెడ్డి తెలిపారు. బీసీ సెల్ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా జగ్గంపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పోచయ్య, మైనార్టీ సెల్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా బండపోతుగల్ గ్రామానికి చెందిన సయ్యద్హుస్సేన్ను ఏక్రగీవంగా ఎన్నుకున్నట్లు అశోక్రెడ్డి తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చిలిపిచెడ్ టీఆర్ఎస్ పలు మండల కమిటీ సెల్ నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే మదన్రెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలో పలు కమిటీలను ఎన్నుకున్నట్లు మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు అశోక్రెడ్డి తెలిపారు.
నర్సాపూర్, సెప్టెంబర్21: నర్సా పూర్ పట్టణ అధ్యక్షుడిగా పంబల భిక్షపతి నాల్గో సారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్రెడ్డికి, కార్యకర్తలకు కృతజ్ఞతలు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రామాయంపేట మండల అధ్యక్షుడికి సన్మానం
రామాయంపేట, సెప్టెంబర్ 21: టీఆర్ఎస్ రామాయంపేట మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆర్.వెంకటాపూర్ సర్పంచ్ బండారు మహేందర్రెడ్డిని మండల సర్పంచ్ల ఫోరం ఘనంగా సన్మానించింది. మంగళవారం టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం అధిష్ఠానం ఆదేశాల మేరకు ఎంపిక చేశారు. దీంతో సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో బండారు మహేందర్రెడ్డిని ఫోరం అధ్యక్షుడు భూమగారి నర్సాగౌడ్, మైలారం శ్యాములు, సుభాష్, మల్లేశం, సురేశ్, సుభాష్ నాయక్, శివప్రసాద్రావు, దోమ ఇమ్మానియేల్లు సన్మానించారు.
టీఆర్ఎస్ మైనార్టీసెల్ అధ్యక్షుడిగా బాబర్ పటేల్
పాపన్నపేట, సెప్టెంబర్ 21: టీఆర్ఎస్ పాపన్నపేట మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా బాబర్ పటేల్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా చోటాసాబ్, కార్యదర్శిగా జాకీర్, సంయుక్త కార్యదర్శిగా యాదుల్, కోశాధికారిగా నయీముద్దీన్, ప్రచార కార్యదర్శిగా షాకీర్ ఎంపికయ్యారు.
శివ్వంపేట మండల నూతన అధ్యక్షుడిగా రాజరమణాగౌడ్
మనోహరాబాద్, సెప్టెంబర్ 21 : టీఆర్ఎస్ శివ్వంపేట మండల అధ్యక్షుడిగా రాజరమణాగౌడ్ ఎన్నికయ్యారు. తనకు పదవి వచ్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే మదన్రెడ్డికి రమణాగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. బీసీ సెల్ మండల అధ్యక్షుడిగా శ్రీనివాస్గౌడ్, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా రవినాయక్, యూత్ మండల అధ్యక్షుడిగా పవన్కుమార్, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా షఫీయొద్దీన్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా వెంకటేశ్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా బాలమణి, రైతుకమిటీ అధ్యక్షుడిగా మైసయ్యయాదవ్, కార్మిక విభాగం అధ్యక్షుడిగా స్వామిలతోపాటు మండల కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
మండల టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శికి సన్మానం
కొల్చారం, సెప్టెంబర్ 21: మండల టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా రెండోసారి ఎన్నికైన ఎండుగుల కృష్ణను కొల్చారం సర్పంచ్ ఉమ, మెదక్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజాగౌడ్, ఉపసర్పంచ్ నింగోల్ల చెన్నయ్య, రైతు సమితి కోఆర్డినేటర్ చింతలగారి కృష్ణ, పార్టీ మాజీ అధ్యక్షుడు శేఖర్, కారోబార్ ప్రభాకర్లు సన్మానించారు.
మండలాన్ని మరింతగా అభివృద్ధి చేస్తాం..
హవేళీఘనపూర్, సెప్టెంబర్ 21: యువకులతో కలిసి మండలాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని టీఆర్ఎస్ యువత విభాగం మండల అధ్యక్షుడు గుండారం కిరణ్గౌడ్ అన్నారు. తనపై నమ్మకం ఉంచి ఈ పదవి అప్పగించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు బాబు, గౌరయ్య, తాళ్ల విఠల్ పాల్గొన్నారు.