తూప్రాన్/రామాయంపేట, సెప్టెంబర్ 13: టీఆర్ఎస్లో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉటుందని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రవీందర్గౌడ్ అన్నారు. సోమవారం తూప్రాన్ మున్సిపల్లోని 13వ వార్డు టీఆర్ఎస్ కమిటీని ఎంపిక చేశారు. వార్డు అధ్యక్షుడిగా సిద్ద్ధిరాములు, ప్రధాన కార్యదర్శిగా జయరాములు, మైనార్టీ కమిటీ అధ్యక్షుడిగా ఎండీ సోహెల్, ప్రధాన కార్యదర్శిగా ఎండీ ముక్తార్, యువజన కమిటీ అధ్యక్షుడిగా గణేశ్, కార్యదర్శిగా నగేశ్, మహిళా కమిటీ అధ్యక్షురాలిగా స్వప్న, కార్యదర్శిగా గంగాభవాని, బీసీ అనుబంధ కమిటీ అధ్యక్షుడిగా సత్యనారాయణ, కార్యదర్శిగా మల్లేశ్ను ఎన్నుకున్నట్లు వారు తెలిపారు.చైర్మన్ వెం ట మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ ఉన్నారు.
మనోహరాబాద్ మండలంలో…
తూప్రాన్, మనోహరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. మనోహరాబాద్ మం డలం ముప్పిరెడ్డిపల్లిలో మండల అధ్యక్షుడు మహేశ్వర్ అధ్యక్షతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. గ్రామకమిటీ అధ్యక్షుడిగా లక్ష్మణ్ యాదవ్ను ఎన్నుకొని నియామక పత్రా న్నిఅందజేశారు.కార్యక్రమంలో సర్పంచ్ ప్రభావతి పెంట య్య,ఉపసర్పంచ్ కరుణాకర్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
తూప్రాన్లో..
తూప్రాన్ మండలం యావాపూర్లో మండల అధ్యక్షుడు బాబుల్రెడ్డి అధ్యక్షతన గ్రామకమిటీని ఎన్నుకున్నారు. నూ తన అధ్యక్షుడిగా లక్ష్మారెడ్డిని ఎన్నుకోగా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాణిసత్యనారాయణగౌడ్, ఎంపీపీ స్వప్నవెంకటేశ్, ఎంపీటీసీ సంతోశ్రెడ్డి, సర్పంచ్ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
నర్సాపూర్లో…
మండల పరిధిలోని బ్రాహ్మణపల్లిలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆంజనేయులు, నర్సింగ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడిగా శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్గౌడ్, అశోక్, సెక్రటరీగా కృష్ణ, కార్యవర్గ సభ్యులుగా జైరాంలు, పుట్టి కిషన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పా ల్గొన్నారు.
మొదటి వార్డులో కమిటీ సభ్యుల నియామకం
నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని మొదటి వార్డులో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కౌన్సిలర్ అశోక్గౌడ్ ఆధ్వర్యంలో వార్డు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అశోక్గౌడ్ మాట్లాడుతూ అధ్యక్షుడిగా ఎండీ షాద్ఖాన్, ఉపాధ్యక్షుడిగా శివగౌడ్ ,బీసీ, ఎస్సీ, మైనార్టీ, రైతు సంఘం, యూత్ అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కొల్చారం మండలంలోని 20 గ్రామాల్లో
కొల్చారం మండలంలోని 20 గ్రామాల్లో టీఆర్ఎస్ కమిటీలను వేశామని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా తెలిపారు. రంగంపేట గ్రామంలో అధ్యక్ష పదవికి పోటీ తీవ్రంగా ఉండడంతో ఏకాభిప్రాయం కోసం వాయిదా వేసినట్లు తెలిపారు. కొంగోడు గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా శ్రీనివాస్, కార్యదర్శిగా అశోక్, నాయిన్ జలాల్పూర్ అధ్యక్షుడిగా దాసు రా ములు, కార్యదర్శిగా నాయిన్ సోమయ్య, పోతిరెడ్డిపల్లి అధ్యక్షుడిగా వెంకాగౌడ్, కార్యదర్శిగా రమేశ్, వసూరాం తండా అధ్యక్షుడిగా రాంచందర్,కార్యదర్శిగా శివ, అంసాన్పల్లి అధ్యక్షుడిగా యాదాగౌడ్, కార్యదర్శిగా ధన్రాజ్, వెంకటాపూర్ అధ్యక్షుడిగా వెంకటేశం, కార్యదర్శిగా పోచయ్య, పోతంశెట్పల్లి అధ్యక్షుడిగా రాజేశ్, కార్యదర్శిగా నాగరాజు, అప్పాజిపల్లి అధ్యక్షుడిగా శ్రీశైలం, కార్యదర్శిగా నర్సింహు లు, కిష్టాపూర్ అధ్యక్షుడిగా రవి, కార్యదర్శిగా మల్లేశం, రాం పూర్ అధ్యక్షుడిగా పోచయ్య, కార్యదర్శిగా రాజు, చిన్నఘనపూర్ అధ్యక్షుడిగా లక్ష్మీపతి, కార్యదర్శిగా నర్సింహులు, సీతారాంతండా అధ్యక్షుడిగా హరిచంద్, కార్యదర్శిగా శ్రీనివాస్, వరిగుంతం అధ్యక్షుడిగా వీరేశం, ఉపాధ్యక్షుడిగా రాజు, సంగాయిపేట అధ్యక్షుడిగా నారాయణ, కార్యదర్శిగా నవీన్, తుక్కాపూర్ అధ్యక్షుడిగా మల్లయ్య, కార్యదర్శిగా రామ య్య, పైతర అధ్యక్షుడిగా మల్లేశం,కార్యదర్శిగా శేఖర్, కోనాపూర్ అధ్యక్షుడిగా భాగయ్య, కార్యదర్శిగా వెంకటేశం, ఏటిగడ్డమాందాపూర్ అధ్యక్షుడిగా రాజాగౌడ్, కార్యదర్శిగా ఎల్లయ్య, ఎనగండ్ల అధ్యక్షుడిగా మంగలి వెంకటేశం, కార్యదర్శిగా సత్యాగౌడ్ ఎన్నికైనట్లు తెలిపారు.
కొల్చారంలో…
కొల్చారం టీఆర్ఎస్ అధ్యక్షుడిగా దుర్గాప్రసాద్గౌడ్ ఎన్నికయ్యారు. కొల్చారంలో టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు శేఖర్, ఏఎంసీ సభ్యుడు రాజాగౌడ్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. గ్రామ శాఖ అధ్యక్షుడిగా దుర్గాప్రసాద్గౌడ్, ఉపాధ్యక్షుడిగా నీరుడి గోపాల్, కార్యదర్శిగా నాగయ్య, సంయుక్త కార్యదర్శిగా మంగలి సిద్ధి రా ములు, కోశాధికారిగా నర్సింహులు, కార్యవర్గసభ్యులుగా దోమకిండ సిద్ధిరాములు, పల్వంచ శ్రీనివాస్గౌడ్, యాదగిరి, నీరుడి గట్టయ్య, చౌరిగారి అజయ్, చౌరిగారి శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
నార్సింగి పట్టణంలో…
నార్సింగి పట్టణ టీఆర్ఎస్ కమిటీ తో పాటు మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. నార్సింగి పట్టణ శాఖ అధ్యక్షుడిగా సుదీప్గౌడ్, ఉపాధ్యక్షుడిగా తమ్మారెడ్డి సునీల్రెడ్డి, కార్యదర్శి మహేశ్, కోశాధికారిగా ఎండీ ఇర్ఫాన్ఖాన్, ప్రచార కార్యదర్శిగా శిర్ణవెంకటేశ్, కార్యవర్గ సభ్యులుగా నాగవర్ధన్, హరీశ్, ప్రభు ఎన్నికైయ్యారు. పెద్ద తండా టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా సుభాశ్ ఎన్నికైయ్యారు. కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు తౌర్యనాయక్, ఎంపీపీ సబిత, జడ్పీటీసీ కృష్ణారెడ్డి , సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు అశోక్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సత్యనారాయణ, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు లింగారెడ్డి, పెద్ద తండాసర్పంచ్ చత్రీయ ఉన్నారు