మనోహరాబాద్, ఆగస్టు 4 : చెరువు, కుంటల ఎఫ్టీఎల్ లో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్ అన్నారు. మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి శివారులోని ఓ కుంట ఎఫ్టీఎల్ పరిధిలో ని యో సీడ్స్ పరిశ్రమ నిర్వాహకులు మట్టి రోడ్డును నిర్మించారు. విషయం తెలుసుకున్న ఆయన కుంట ఎఫ్టీఎల్ ను పరిశీలించారు.వెంటనే మట్టి రోడ్డును తొలిగించాలని పరిశ్రమ నిర్వాహకులకు సూ చించారు. కార్యక్రమంలో ఏఈ అనురా ధ పాల్గొన్నారు.
మున్సిపల్ అనుమతి ఉండాలి
రామాయంపేటలో అను మతి లేకుండా కట్టడాలు నిర్మిస్తే వారిపై కఠిన చర్య లు ఉంటాయని ఎన్ఫోర్స్ మెంట్ కమిటీ టీం లీడర్ తహసీల్దార్ శేఖర్రెడ్డి అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. పట్ట ణంలో అనుమతి లేకుండా నిర్మాణాలు జోరుగా సాగు తున్నాయని అలాంటి వాటిని గుర్తించి జరిమానాలు విధిస్తామన్నారు. బిల్డింగ్ల నిర్మాణం చేపట్టేవారు ముందుగా మున్సిపల్ అనుమతి తీసు కోవాలన్నారు. అనుమతి తీసుకోకుండా నిర్మాణాలు చేస్తున్న భవనాలకు 25శాతం జరిమానా తప్పదన్నారు. పట్టణ శివారులో అనుమతి లేని లే అవుట్లను ప్రభుత్వ ఆదేశాల మేరకు కూల్చివేస్తామన్నారు.ఈ సమావేశంలో ఎన్ఫోర్స్మెంట్ కమిటీ సభ్యులు ఎస్సై రాజేశ్, కమిషనర్ శ్రీనివాసన్, ఆర్అండ్బీ ఏఈ విజయసారధి, ఫైర్ అధికారి అనిల్కుమార్, టౌన్ప్లానింగ్ అధికారులు దేవరాజు, కాలేరు ప్రసాద్ ఉన్నారు.