జిన్నారం, సెప్టెంబర్ 13 : ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నా రు. జిన్నారం శివారులోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో రూ.కోటీ 35లక్షలతో నిర్మించిన బాలికల కళాశాల భవనం, రూ.42లక్షలతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాలను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొ క్కలు నాటి మాట్లాడారు. జిన్నారం మండలంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించి, నాణ్యమైన విద్యనందిస్తామన్నారు. ఈ ప్రాంతం ఎడ్యుకేషన్ హబ్గా మారిందన్నారు. జిన్నా రం నుంచి మోడల్ స్కూల్ బొల్లారం తరలిపోయిందని ఎంపీటీసీ వెంకటేశంగౌడ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. మండల కేంద్రంలో మోడ ల్ స్కూల్, గురుకుల పాఠశాల ఏర్పాటుకు సంబంధిత అధికారులతో మాట్లాడుతానని ఎమ్మెల్యే హామీనిచ్చారు. రవాణా సౌక ర్యం విషయంపై ఆర్టీసీ అధికారులతో మాట్లాడతానన్నారు. మినీ స్టేడియం పను లు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఖాజీపల్లిలో వినాయకుడికి ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ రవీందర్గౌడ్, సర్పంచ్ లావణ్యశ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీలు వెంకటేశంగౌడ్, లావణ్యనరేశ్, వైస్ ఎంపీపీ గంగురమేశ్, సర్పంచ్లు జనార్దన్, ఆంజనేయులు, శివరాజ్, వెంకటయ్య, తహసీల్దార్ దశరథ్, ఎంపీటీసీ సుమతి, ఇన్చార్జి ఎంఈవో విజయ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్, ఉపసర్పంచ్ సంజీవ, నాయకులు సురేందర్గౌడ్, రవీందర్, కృష్ణ, సార నరేందర్, మహేశ్, పుట్టి భాస్కర్, కోఆప్షన్ సభ్యుడు ఇంతియాజ్ అహ్మద్, కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ కవిత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం నరేశ్కుమార్, నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.