వెల్దుర్తి/నర్సాపూర్/ రామాయంపేట/నిజాంపేట/ అల్లాదుర్గం/ చిన్నశంకరంపేట/ సెప్టెంబర్ 21: ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా పట్టణాలు, మండలాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్రీడం రన్ నిర్వహించారు. రాష్ట్ర యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో వెల్దుర్తి, మాసాయిపేటల్లో ఫిట్ ఇండియా 2కే ఫ్రీడమ్ రన్ను నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువకులు, నాయకులు అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడి 2కే రన్ చేపట్టారు. మాసాయిపేట తహసీల్దార్ మాలతి, వెల్దుర్తి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య పాల్గొని మాట్లాడారు. ఎస్ఎంసీ చైర్మన్ వెంకటేశం, వార్డు సభ్యులు శాఖారం శ్రీను, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నర్సాపూర్ ప్రభుత్వ పాఠశాలలో జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్ ఫ్రీడం రన్ను జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా సెక్టోరియల్ అధికారిని జ్యోతి, ఎంఈవో బుచ్చానాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుమాధవ్ శర్మ, ఎంఐఎస్ కోఆర్డినేటర్ బి.సుధాకర్గౌడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రామాయంపేట పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలల విద్యార్థులు అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ చేసి పట్టణంలో నినాదాలు చేస్తూ పెద్దఎత్తున ర్యాలీ చేపట్టారు.
రామాయంపేట ఎస్సై.రాజేశ్, హెచ్ఎంలు విక్రమాదిత్య, ప్రసన్నమణి పాల్గొని మాట్లాడారు. యువజన సంఘాల నాయకుడు యాదగిరి నిర్వహించారు. పాపన్నపేట మండలంలోని పాపన్నపేట, కుర్తివాడతోపాటు వివిధ ఉన్నత పాఠశాలల్లో మంగళవారం ఫిట్ ఇండియా ఫ్రీడం రన్ నిర్వహించారు. నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు మంగళవారం ఫిట్ ఇండియా 2కే ఫ్రీడం రన్లో పాల్గొన్నారు. యువజన సంఘం సభ్యులు రన్లో పాల్గొన్నారు. అల్లాదుర్గం మండల కేంద్రం అల్లాదుర్గంలో ఎస్సై మోహన్రెడ్డి ఫిట్ ఇండియా 2కే రన్ నిర్వహించారు. హెచ్ఎం ధనుంజయ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చిన్నశంకరంపేటలో తెలంగాణ మోడల్ పాఠశాల విద్యార్థులు ఫ్రీం రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద మానవహారాన్ని నిర్వహించారు. ఉపసర్పంచ్ జీవన్, వార్డు సభ్యులు కుమ్మరి శ్రీనివాస్, లింగంగౌడ్ పాల్గొన్నారు.