మెదక్ మున్సిపాలిటీ, జూలై 20: తొలి ఏకదాశి పురస్కరించుకొని మెదక్ పట్టణ శివారులోని పసుపులేరు ఒడ్డు మాత రేణుకాంబ ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రేణుకాంబను వివిధరకాల పండ్ల తో అమ్మవారిని అలంకరించారు. భక్తులు ఉదయం నుంచే అమ్మవారిని దర్శించుకుని మెక్కులు చెల్లించుకున్నారు. ఈ పూ జ కార్యకమాల్లో ఆలయ కమిటీ అధ్యక్షుడు కొండన్ సురేందర్గౌడ్ పాల్గొన్నారు. పట్టణంలోని పలు దేవాలయాలలో ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు.
మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు
మెదక్ రూరల్ ,జూలై 20: తొలి ఏకాదశి పురస్కరించుకొని మంగళవారం మెదక్ మండల పరి ధి లోని మంబోజిపల్లి శివారులోని కోయ్యగుట్ట పై కొలువు దీరిన మల్లికార్జున స్వామి అలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నాగ్సాన్పల్లిలో….
పాపన్నపేట,జూలై 20: మండల పరిధిలోని నాగ్సాన్పల్లి అనంత పద్మనాభస్వామి ఆలయంలో తొగుట పీఠాధిప తి మాధవానంద స్వామి ప్రత్యే క పూజలు నిర్వహించారు. మంగళవారం తొలి ఏకాదశిని పురస్కరించుకొని అక్కడకు చేరుకున్న స్వామి ప్రత్యేక పూ జలు నిర్వహించా రు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.
రామాయంపేటలో…
రామాయంపేట, జూలై 20: రామాయంపేట పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలోని దేవాలయాల్లో పూలతో అలంకరణలు చేసి పూజలు చేశారు. .
భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి
పెద్దశంకరంపేట,జూలై 20: ఆషాఢ తొలి ఏకాదశి వేడుకలను మంగళవారం పెద్దశంకరంపేట మండలంలో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పెద్దశంకరంపేటలోని వేంకటేశ్వర ఆలయం, వేణుగోపాలస్వామి , విఠలేశ్వర, మానిక్ప్రభుఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో హాజ రై పూజలు నిర్వహించారు.
చిన్నశంకరంపేట….
చిన్నశంకరంపేట,జూలై 20: చిన్నశంకరంపేటతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లోతొలి ఏ కాదశి ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.