మెదక్, జూలై 22 : రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా 24న చేపట్టే ముక్కో టి వృక్షారన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మెదక్ జిల్లాలో మూడు లక్షల మొక్కలు నాటడమే లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గురువారం మెదక్లోని తన క్యాంపు కార్యాలయంలో ‘ముక్కోటి వృక్షార్చన’ వాల్ పోస్టర్ను మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్తో కలిసి ఆమె ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలనలో తనదైన ముద్రవేస్తూ ఐటీలో తెలంగాణను ప్రపంచస్థాయిలో నిలిపి ఘనత కేటీఆర్కే దక్కుతుందన్నారు. ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో 24న మెదక్ జిల్లాలోని 21 మండలాలు, నాలుగు మున్సిపాలిటీల్లో మూడు లక్షల మొక్కలు నాటాలని పార్టీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు.కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు కిశోర్, జయరాజ్, సమీయొద్దీన్, లక్ష్మీనారాయణగౌడ్, ఆర్కే శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి గడ్డమీది కృష్ణాగౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, టీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, జయరాంరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, మధుసూదన్రావు, దుర్గప్రసాద్, శ్రీధర్యాదవ్, ముత్యంగౌడ్, ప్రవీణ్గౌడ్, ప్రభురెడ్డి, సుమన్, కొర్వి రాములు, అంజాద్, మెదక్ మండల అధ్యక్షుడు అంజాగౌడ్, కిష్టయ్య, షాకీర్, వెంకట్, రవి నాయకులు పాల్గొన్నారు.