సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 4: తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక తారా ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో మొ క్కలు నాటారు. ఎన్ఎస్ఎస్ యూనిట్లు 1,2,3,4 విభాగాలు, ఎకో క్లబ్ ఆధ్వర్యంలో రెండో రోజూ మొక్క లు నాటే కార్యక్రమం జోరుగా కొనసాగింది. అధ్యాపకులు ఉత్సాహంగా మొక్కలు నాటి నీరు పో శారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ మాట్లాడుతూ ప్రభుత్వ పిలుపు మేరకు రెండు రోజుల పాటు హరిత హారం కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. మొదటి రోజు 400 మొక్కలు, రెండో రోజు 200 మొక్కలు, మొత్తం 600ల మొక్కలు నాటామన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అధ్యాపకులు, విద్యార్థులపై ఉందన్నారు. కళాశాలలో మొక్కలు నాటేందుకు సహకరించిన మున్సిపల్ కమిషనర్, సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ వెంకటేశం, డాక్టర్ ఉపేందర్, ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ జగదీశ్వర్, ఏవో దినేష్శుక్లా, అధ్యాపకులు అభిజిత్, మహంతయ్య, శ్రావ ణి, కృష్ణ, లింగస్వామి, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు.