తూప్రాన్ రూరల్, జూలై 18 : ఇండ్ల ఎదుట మొక్కలను నాటి సంరక్షించుకోవడం తో ఇండ్ల పరిసరాలు అందంగా కనబడుతాయని మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్ అన్నారు. ఎవరికి ఎలాంటి మొక్కలు కావాలో అడిగితే మున్సిపల్ సిబ్బంది అందజేస్తారని, తూప్రాన్ పట్టణంలోని 1వార్డులో చైర్మన్,7వ వార్డులో కౌన్సిలర్ భగవాన్రెడ్డి ఆదివారం ఇంటింటికీ తిరుగుతూ 6 రకాల పండ్లు,పూల మొక్కలను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇండ్ల పరిసరాల్లో 6 మొక్కలకు తక్కువ కాకుండా నాటి సంరక్షించాలన్నారు. మొక్కలను నాటి సంరక్షించి ఆకుపచ్చని పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత ప్రజలపై ఉందన్నారు.వారి వెంట మహిళా సంఘాల సభ్యులు,అంగన్వాడీ టీచర్లు, మున్సిపల్ సి బ్బంది పాల్గొన్నారు.
గ్రామాల్లో స్వచ్ఛభారత్
తూప్రాన్ మండలం ఇస్లాంపూర్, మల్కాపూర్, నాగులపల్లి, దాతర్పల్లితో పాటు పలు గ్రామాల్లో ఆదివారం స్వచ్ఛభారత్ను నిర్వహించారు. ఈసందర్భంగా ఇండ్ల పరిసరాలు, రోడ్లు, వీధుల పక్కన పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని ,ముండ్ల పొద లు, గడ్డి, యువకులు, మహిళలు,గ్రామస్తులు తొలిగించి శుభ్రం చేశారు.
హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ
సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తగా కోనాయిపల్లి(పీబీ)లో సర్పంచ్ పాండు పారిశుధ్య కార్మికులతో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. గ్రామంలోని పలు వీధులు,ఇండ్ల పరిసరాలు,రోడ్లపై ఈ ద్రావ ణాన్ని పిచికారీ చేశారు.
హరితహారం నిరంతర ప్రక్రియ
హరితహారం నిరంతర ప్రక్రియ అని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి అన్నారు. రామాయంపేట మున్సిపల్లోని వైకుంఠధామ పనులను పరిశీలించి కోమటిపల్లి, గొల్పర్తి గ్రామాల్లో మొక్కలు నాటారు.కార్యక్రమంలో రామాయంపేట పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, సిబ్బంది కాలేరు ప్రసాద్, నవాత్ ప్రసాద్, శంకర్, నరేశ్, శ్రీనివాస్, పద్మ అశ్విని, కౌన్సిలర్లు దేమె యాదగిరి , చిలుక గంగాధర్, బొర్ర అనిల్, గజవాడ నాగరాజు ఉన్నారు
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
నీటి నిల్వ వల్ల దోమలు, ఈగలు వృద్ధి చెంది వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని సర్పంచ్ భాగ్యమ్మ, కార్యదర్శి నర్పింహులు అన్నారు. లక్ష్మాపూర్లోఇంటింటికీ వెళ్లి పరిసరాలను పరిశీలించారు. ఇండ్లలోనిల్వ ఉన్న నీటిని పారబోయించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డుసభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.
మొక్కలను సంరక్షించాలి
మొక్కలు నాటడంతో పాటు ట్రీగార్డులు ఏర్పాటు చేసి వాటిని సంరక్షించాలని నందిగామ సర్పంచ్ ప్రీతి అన్నారు గ్రామంలో ఇంటింటికీ ఆరు మొక్కలను ఆమె అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ ప్రీతి మాట్లాడుతూ హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు పూర్తిగా ఎదిగే వ రకు సంరక్షించాలన్నారు . కార్యక్రమంలో మహిళలు ఉన్నారు.