హవేళీఘనపూర్, జూలై 23: ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటాలని హవేళీఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఒక్క రూ మూడు మొక్కలు నాటి మంత్రి కేటీఆర్కు పుట్టిన రోజు బహుమతిగా ఇవ్వాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలు వీధుల్లో మొక్క లు నాటాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం 1గంటకు హవేళీఘనపూర్లో కేక్కట్ చేసి సంబురాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమానికి మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు.
పట్టణంలో 25 వార్డుల్లో మొక్కలు నాటుతాం
మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా జి ల్లా కేంద్రంలో ముక్కోటి వృక్షార్చన నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ తెలిపారు. ఆ యన మున్సిపల్ కార్యాయంలో విలేకరులతో మాట్లాడారు. పట్టణం లో ఎంపిక చేసిన 25 వార్డుల్లో ఆయా ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు గుం తలు సిద్ధ్దం చేసినట్లు తెలిపారు. 6వ వార్డు నుంచి ఎమ్మెల్యే మొక్కలు నాటడం ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమానికి కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని చంద్రపాల్ పిలుపునిచ్చారు.
మున్సిపల్ కార్యాలయంలో…
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని శనివారం మున్సిపల్ కార్యాలయంలో ఉద యం 11.30 గంటలకు జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.గౌరవ సభ్యులు సకాలంలో హాజరు కావాలని చైర్మన్ విజ్ఞప్తి చేశారు
9,10 వార్డుల్లో..
హరితహారంలో భాగంగా 9,10 వార్డుల్లో ఆయా వార్డుల కౌన్సిలర్లు మేడి కల్యాణి, కండెల సుంకయ్యలతో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సం రక్షించాలన్నారు.మొక్కలను పశువులు మేయకుండా కంచె ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, కౌన్సిర్లు ఆర్కె శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్రావు, ఏఈ సిద్ధేశ్వరి, మున్సిపల్ సిబ్బంది చంద్రమోహన్, దుర్గపతి పాల్గొన్నారు. 28వ వార్డులో జరుగుతున్న కల్వర్టు నిర్మాణ పనులను వార్డు కౌన్సిలర్ మమత ప్రవీణ్గౌడ్తో కలిసి చైర్మన్ పరిశీలించారు.
మెదక్ రూరల్లో…
మెదక్రూరల్, జూలై 23 : హరితహారంలో ప్రభుత్వం లక్ష్యాలను అధిగమించాలని ఎం పీడీవో శ్రీరాములు అన్నారు. మండల పరిధిలోని తిమ్మనగర్ , మక్తాభూపతిపూర్లో అవే న్యూప్లాంటేషన్లో భాగంగాహరితహారం మొక్కలు నాటడం కోసం సర్పంచ్ నర్సింహులు ఆధ్వర్యంలో రోడ్డుకు ఇరువైపులా గుంతలు తీశారు. ఎంపీడీవో శ్రీరాములు, ఎంపీవో వాటిని పరిశీలించారు
.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో మండలంలో ఒక గంటలో 150 మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీకార్యదర్శి పాల్గొన్నారు.