కొల్చారం, ఆగష్టు 4: దైవంపై విశ్వాసం ఉంచి నమ్మకంతో ముందుకు సాగినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని కొల్చారం మండలం రంగంపేట మాధవానంద ఆశ్రమ పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి అన్నారు. ఆశ్రమ పీఠంలో 5 రోజులుగా నిర్వహిస్తున్న చండీయాగం బుధవారం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసింది. అంతకుముందు ఉదయం మహాదేవి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవానంద సరస్వతీ స్వామి భక్తుల నుద్దేశించి అనుగ్రహభాషణం వినిపించారు.
దర్శించుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్, ఎమ్మెల్యే
చండీయాగం ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి హాజరై గురుపాదుకలకు పూజలు చేశారు. అనంతరం శ్రీ మాధవానంద సరస్వతీ స్వామిని దర్శించుకున్నారు. స్వామి అనుగ్రహభాషణం విన్నారు. జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్, సెక్టోరియల్ అధికారి సుభాశ్ స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మేఘమాల, ఎంపీపీ మంజుల, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు గౌరీశంకర్, కౌడిపల్లి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కాలేరు శివాంజనేయులు, స్థానిక సర్పంచ్ బండి సుజాత, ఎంపీటీసీ మాధవి, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్రెడ్డి, వీపీ మల్లేశం పాల్గొన్నారు.