వెల్దుర్తి, జూలై 22. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు, వాగుల్లోకి నీరు చేరుతున్నాయి. ఇప్పటికే పొంగిపొర్లిన హాల్దీప్రాజెక్టు, హల్దీవాగు చెక్డ్యాం లు, మరోమారు అలుగులు పారడానికి, మత్తడి దూకడానికి సిద్ధంగా ఉన్నాయి. వెల్దుర్తి, మాసాయిపేటలతో పాటు ఉమ్మడి వెల్దుర్తి మండలం వ్యాప్తంగా చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. మాసాయిపేట మండలం రామంతాపూర్తాండాలో నీరు నిల్వకుండా సర్పంచ్ ఫకీరానాయక్ ఇంటింటికీ తిరుగుతూ అవగాహన కల్పించారు.
చేగుంటలో..
చేగుంట, నార్సింగి మండలంలో రెండు రోజులుగా వాన కురువడంతో పలు గ్రామాల్లోని చెరువులు కుంటలు ఆలుగు పారుతున్నాయి. వడియారం, రెడ్డిపల్లిలో వర్షానికి ఇండ్లు కూలి పోయా యి.చెరువులు, కుంటలు నీటితో కళకళ లాడుతున్నాయి.
రామాయంపేటలో…
రామాయంపేట మండల వ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి గురువా రం ఉదయం వరకు కురిసి వర్షానికి మండలంలోని అక్కన్నపేట, దంతెపల్లి, కాట్రియాల గ్రామాల్లోని కుంటలు నిం డాయి. మండలంలోని అక్కన్నపేటలోని వెల్ములోని కుం ట, దంతెపల్లి ఊరకుంటలు నిండి వరి పంటలు జలమయ్యాయి. రామాయంపేట పట్టణంలోని పలు కాలనీల లోకి నీరు చేరుకోవడంతో కాలనీ వాసులు ఇబ్బందులకు గురయ్యారు.
నిజాంపేటలో…
మండలంలోని పలు గ్రామాల్లో రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో మండల వ్యాప్తంగా 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.