మంచిర్యాల : రూ.2.90 లక్షల విలువైన పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. ఏసీపీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. విశ్వసనీయ సమాచారం మేరకు మంచిర్యాల ఇన్స్పెక్టర్ ముత్తి లింగయ్య తన సిబ్బందితో ఓ వేర్హౌస్పై రైడ్ చేశారు. ఈ సందర్భంగా రూ.2.90 లక్షల విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ వేర్హౌస్ ఆదిత్యా ఎంటర్ప్రైజెస్కు చెందినదిగా సమాచారం. నిషేధిత ఉత్పత్తులను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు.