కోటపల్లి, జనవరి 26 : ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. కోటపల్లి మండలం ఆలుగామ గ్రామానికి చెందిన అంబాల వంశీవర్ధన్, అంబాల విజయేంద్రసాయిల ఈ నెల 17న ప్రాణహిత నదిలోకి ఈతకు వెళ్లి మరణించారు. ఈ రెండు కుటుంబాలకు భీమారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలఉపాధ్యాయులు అండగా నిలిచారు.
పాఠశాలకు చెందిన విద్యార్థులు మరణించానే వార్త తెలుసుకున్న ఉపాద్యాయులు ఆ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయులు పోగుచేసి, జమయిన మొత్తంలో విజయేంద్రసాయి, వంశీవర్ధన్ రెండు కుటుంబాలకు కుటుంబానికిరూ.10,500 నగదుతో పాటు 50 కిలోల బియ్యం అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర రావ్, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ సత్యనారాయణ, ఉపాధ్యాయులు కె.శ్రీమూర్తి, బి.శ్రీనివాస్, వేణుగోపాల్, ఆర్.శ్యాంసుందర్,ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.