మందమర్రి రూరల్ : స్వరాష్ట్ర సాధన కోసం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషి మరువలేనిదని జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతిని పురస్కరించుకుని సోమవారం స్థానిక జీఎం కార్యాలయంలో నిర్వహించిన జయంతిలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. భారత స్వాతంత్య్ర ఉద్యమంతో పాటు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆయన ఎన్నో ఉద్యమాలు చేశారని చెప్పారు.
1952 ఆయన అదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని తెలిపారు. వాంకిడిలో లక్ష్మణ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రజాలకు సేవలందించారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన సర్వస్వాన్ని కొల్పోయి వృద్ధాప్యంలో కిరాయి ఇంటిలో జీవితం గడిపారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వో టూ జీఎం గోపాల్ సింగ్, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు ఎం. సంపత్, ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేశ్, పీఎం వర ప్రసాద్, ఏజీఎం ఎఫ్ఆండ్ఏ చక్రవర్తి అధికారులు పాల్గొన్నారు.