మంచిర్యాల : జిల్లాలో గంజాయి అమ్మకం కొనుగోళ్లపై పోలీసలు ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీస్ సిబ్బందితో కలిసి మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో నిఘా పెట్టారు. జిల్లా కేంద్రంలోని తిలక్నగర్ సున్నం బట్టి వాడలో కొంతమంది వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించారు.
నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కిలో గంజాయి, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగాఏసీపీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. యువకులు గంజాయికి అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు.
ఎక్కడైనా గంజాయి అమ్ముతున్నట్లు, తాగుతున్నట్లు తెలిపినా సమాచారాన్ని పోలీసులకు తెలుపాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.