లక్షెట్టిపేట రూరల్ : కొవిడ్ -19 నివారణలో భాగం లక్షెట్టిపేట పట్టణంతో పాటు మండలంలో వందశాతం వ్యాక్సినేషన్ను పూర్తి చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠీ అన్నారు. సోమవారం పట్టణంలోని వ్యాక్సిన్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ వేసినట్టు అతికించిన స్టిక్కర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. వ్యాక్సిన్ కేంద్రాలలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజల ఆరోగ్య భద్రతపై నిరంతరం పర్యవేక్షించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆమె వెంట మున్సిపల్ చైర్మన్ కాంతయ్య, వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్, కౌన్సిలర్లు చల్ల నాగభూషణం, చింత సువర్ణ, మేనేజర్ శ్రీహరి, మున్సిపల్ సిబ్బంది, వైద్య సిబ్బంది ఉన్నారు.