హైదరాబాద్ : ప్రమాదవశాత్తు నిర్మాణంలో ఉన్న చెక్డ్యామ్ గుంతలోపడి తల్లీకుమారుడు ప్రాణాలు కోల్పోయారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కమ్మంపల్లి గ్రామానికి చెందిన సుమలత (45) ఆమె కుమారుడు మనోజ్ (15) మధ్యాహ్నం గ్రామశివారులోని చెక్డ్యామ్ వద్ద తాగునీరు తీసుకువచ్చేందుకు వెళ్లారు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు వెతుకుతుండగా చెక్డ్యామ్ గుంతలో మృతదేహాలు కనిపించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఒకేసారి తల్లీకుమారుడు మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.