నేటికి పదకొండు రోజులు
మూసి ఉన్న వ్యాపార సముదాయాలు
నిర్మానుష్యమైన ప్రధాన రోడ్లు
అత్యవసరాలకు మాత్రమే మినహాయింపు
బోథ్, ఏప్రిల్ 18: మహారాష్ట్ర సరిహద్దులోని కిన్వట్ మున్సిపాలిటీలో కొనసాగుతున్న లాక్డౌన్ ఆదివారం పదో రోజుకు చేరుకుంది. అక్కడ కేసుల ఉధృతి దృష్ట్యా ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూ, 144 సెక్షన్ విధించగా కిన్వట్లో మాత్రం మున్సిపల్ పాలకవర్గం, వ్యాపారులు, ప్రజలు కలిసి పూర్తి లాక్డౌన్ పాటించాలని నిర్ణయించారు. మెడికల్ షాపులు, దవాఖానలు తదితర అత్యవసర వాటికి మాత్రమే మినహాయింపు ఇచ్చారు. అక్కడ లాక్డౌన్తో బోథ్, ఇచ్చోడ, ఆదిలాబాద్ తదితర ప్రాంతాలకు ప్రజా రవాణా తగ్గిపోవడంతో కేసులు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట వాసులు రాష్ట్రంలోకి ప్రవేశించడంతోనే సరిహద్దు మండలాల్లో కరోనా వైరస్ ఉధృతి పెరిగింది. సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేసి కట్టుదిట్టం చేయడంతో అత్యవసర పనులున్నవారు కూడా రాకపోకలు వాయిదా వేసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రిన్సిపాల్ చెంపదెబ్బ.. బాలిక ఆత్మహత్య
కొవిడ్ కేర్ కోచ్లు ఏర్పాటు చేయాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వ విజ్ఞప్తి