నాలుగో రోజూ కొనసాగినలాక్డౌన్
నిర్మానుష్యంగా రోడ్లు
నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా
బోథ్, మే 15: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ శనివారం నాలుగో రోజూ కొనసాగింది. ఉదయం 10 గంటల తర్వాత అన్ని దుకాణాలు మూసివేసేలా లాక్డౌన్ ఆంక్షలను పోలీసులు అమలు చేస్తున్నారు. దీంతో రోడ్ల వెంట ప్రజలు తిరగకపోవడంతో నిర్మానుష్యంగా మారాయి. ఇదిలా ఉండగా ఘన్పూర్ సరిహద్దు చెక్పోస్టు వద్ద తనిఖీ కేంద్రాన్ని సీఐ ముదావత్ నైలు సందర్శించారు. మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే వాహనదారులకు అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితి ఉన్న ఈపాస్ తీసుకొని వస్తేనే రాష్ట్రంలోకి అనుమతిస్తామన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
ఇంద్రవెల్లి, మే 15: లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ నాగ్నాథ్ హెచ్చరించారు. మండలంలో లాక్డౌన్ పకడ్బందీగా కొనసాగింది. రోడ్డుపైకి వచ్చిన వాహనదారులకు ఏఎస్ఐ అశోక్ జరిమానా విధించారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పకడ్బందీగా లాక్డౌన్
నార్నూర్, మే 15: నార్నూర్, గాదిగూడ మండలాల్లో లాక్డౌన్ పకడ్బందీగా కొనసాగుతుంది. నార్నూర్ ఎస్ఐ డీ రాజు, గాదిగూడ ఎస్ఐ ముజాహిద్ మండలాల పరిధిలో పర్యవేక్షించారు. మాస్కు ధరించని వారికి జరిమానా విధించారు. నార్నూర్, తాడిహత్నూర్, లోకారి(కే), మేడిగూడ మార్కెట్లో పోలీసులు గస్తీ నిర్వహించారు. వాహనాలు తనిఖీ చేశారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో చెక్పోస్టు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వాహనాలను పంపిస్తున్నారు.
పోలీసుల బందోబస్తు
ఇచ్చోడ, మే 15: మండల కేంద్రంలోని అంబేద్కర్, శివాజీ చౌక్ ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక టెంట్ వేసి బందోబస్తు నిర్వహించారు. వాహనాలు తనిఖీ చేశారు. మాస్కు ధరించని వారికి జరిమానా విధించారు.
అత్యవసర పరిస్థితిలో బయటకు రావాలి
సిరికొండ, మే 15: ప్రజలు అత్యవసర పరిస్థితిలోనే బయటకు రావాలని ఎస్ఐ కృష్ణ కుమార్ సూచించారు. మండలంలోని పొన్న ఎక్స్రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నడుచుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట కానిస్టేబుళ్లు నందులాల్, సురేందర్ రెడ్డి, ప్రకాశ్ ఉన్నారు.
ఉట్నూర్లో..
ఉట్నూర్, మే 15: లాక్డౌన్తో గ్రామాలతో పాటు మండల కేంద్రంలోని రోడ్లు, వీధులు నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. ఉదయం మాత్రమే నిత్యావసర సరుకుల కోసం ప్రజలు బయటకు వస్తూ 10 గంటల తర్వాత లాక్డౌన్కు సహకరిస్తున్నారు. ఎస్ఐలు వాహనాల్లో గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలు ఇలాగే సహకరించి కరోనా నియంత్రణను తగ్గించాలని సూచించారు. సీఐ నరేశ్ కుమార్, ఎస్ఐ సుబ్బారావు పాల్గొన్నారు.
తాంసిలో..
భీంపూర్, మే 15: మండలంలోని 13 గ్రామ పంచాయతీల్లో ఎస్ఐ శీరిష ఆధ్వర్యంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్న వారికి జరిమానా విధించారు. ప్రజాప్రతినిధులు, పంచాయతీ అధికారులు లాక్డౌన్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
నేరడిగొండ, మే 15 : మండల కేంద్రంలో ఉదయం 10 గంటల తర్వాత వాణిజ్య, వాపార సంస్థలు, హోటళ్లు, పండ్లు, కూరగాయల దుకాణాలు మూసివేశారు. లాక్డౌన్ సమయం లో రోడ్లపై జనాలు కనిపించకపోవడంతో వీధులు నిర్మానుష్యంగా మారాయి.
జైనథ్లో..
జైనథ్, మే 15: మండలంలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పెన్గంగ సమీపంలోని డొల్లారలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద థర్మల్ స్క్రినింగ్ చేసి ఇతర రాష్ర్టాల వారిని అనుమతించారు. ఎస్ఐ సాయిరెడ్డి వెంకన్న ఆధ్వర్యంలో పోలీసులు గ్రామాల్లో తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వారికి జరిమానా విధించారు.