ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్
ఘనంగా ఎంపీపీ తుల శ్రీనివాస్ జన్మదిన వేడుకలు
బోథ్, జూన్ 12 : సేవాభావంతో పనిచేస్తేనే ప్రజలకు మరింత చేరువ కావచ్చని, దీంతోనే గు ర్తింపు లభిస్తుందని ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. బోథ్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శనివారం ఏర్పా టు చేసిన ఎంపీపీ తుల శ్రీనివాస్ జన్మదిన వేడుకలకు ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగు రా మన్న, రాథోడ్ బాపురావ్, మాజీ ఎంపీ జీ నగేశ్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంతో పాటు రెండేండ్లుగా ఎంపీపీ సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చేరువయ్యారన్నారు.
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మా ట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తే చిరస్థాయిగా నిలిచిపోయే వీలుంటుందన్నారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ మాట్లాడుతూ.. ప్రజలకు సేవచేస్తే సమాజంలో గుర్తింపుతో పాటు గౌరవం పెరుగుతుందని తెలిపారు. అందరం కలిసికట్టుగా పనిచేసి బోథ్ను అభివృద్ధి పథంలో తీసుకెళ్దామన్నారు. మండల పరిషత్ ఆవరణలో హరితవనం, మినీ పార్కులను చూస్తే అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తున్నదన్నా రు. ఎంపీపీ చేస్తున్న కార్యక్రమాలు ప్రభుత్వంతో పాటు పార్టీకి బలం చేకూరుస్తున్నాయని తెలిపారు. మాజీ ఎంపీ నగేశ్ మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే తుల శ్రీనివాస్ నాయకుడిగా ఎదిగారన్నారు. సంక్షేమ పథకాలతో పాటు సేవా కార్యక్రమాలు చేపడుతూ మండలాన్ని అభివృద్ధి పథం లో తీసుకెళ్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, ఆదిలాబాద్, బోథ్ మార్కెట్ కమిటీల చైర్మ న్లు మెట్టు ప్రహ్లాద్, దావుల భోజన్న, సహకార సంఘం చైర్మన్ కే ప్రశాంత్, సర్పంచ్ సురేందర్యాదవ్, ఎంపీడీవో సీహెచ్ రాధ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, టీఆర్ఎస్, నాయకులు పాల్గొన్నారు.
కుట్టు మిషన్లు అందజేత..
మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన మహిళలకు 30 కుట్టు మిషన్లను జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ అందజేశారు. ఎంపీపీ తన పుట్టిన రోజు సందర్భంగా సొంత నిధులతో వీటిని కొనుగోలు చేసి తీసుకొచ్చారు. కుట్టు మిషన్ల ద్వారా స్వయం ఉపాధి పొందాలని సూ చించారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు 23 మందికి తన డబ్బులతో చేయించిన రూ.రెండు లక్షల చొప్పున బీమా పత్రాలను అందజేశారు. దివ్యాంగులకు దుస్తులను పంపిణీ చేశారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
నేరడిగొండ : బోథ్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నేరడిగొండ, బోథ్ మండలాలకు చెందిన 12 మంది లబ్ధిదారులకు జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ నగేశ్తో కలిసి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ చెక్కులు పంపిణీ చేశారు. బోథ్ మండలానికి చెందిన ఆరుగురికి రూ.1,67,500, నేరడిగొండకు చెందిన ఆరుగురికి రూ.1,64,000 కలిపి మొత్తం రూ 3,31,500 మంజూరయ్యాయి. కార్యక్రమంలో ఎంపీపీ తుల శ్రీనివాస్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, సర్పంచ్ సురేందర్యాదవ్, తదితరులు పాల్గొన్నారు.