ఎదులాపురం, మే 8 : ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్లో మనోధైర్యం నింపడం చాలా అవసరమని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సాధన పేర్కొన్నా రు. శనివారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో కొవిడ్ హెల్ప్లైన్ సెంటర్ ప్రా రంభించారు. అంతకు ముందు మాస్కులు పంపి ణీ చేశారు. అనంతరం ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు కుడ్మెత మనోహర్ మాట్లాడుతూ రిమ్స్లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని, ప్రజలు వినియోగించుకోవాలన్నారు. కొవిడ్ సోకినా ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఈ సహాయ కేంద్రాన్ని ఆశ్రయించిన వారికి సేవలందించేందుకు సిద్ధంగా ఉంటామని భరోసా ఇచ్చారు. 7386068182, 9381 736963కి సంప్రదించాలన్నారు. జనవిజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, సీపీ ఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కే శ్రీనివాస్, వీ అశోక్, రైతు సంఘం నాయకుడు బండి దత్తాత్రి, పూసం సచిన్ తదితరులు పాల్గొన్నారు.