మంచిర్యాలటౌన్ : రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అత్యంత బలమైన శక్తిగా అవతరించిందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. శుక్రవారం మంచిర్యాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వార్డు, గ్రామ కమిటీల జాబితాను టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి గూడూరి ప్రవీణ్కు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతీ కార్యకర్తకు క్రమశిక్షణ ఎంతో అవసరమని, క్రమశిక్షణతోనే ఉన్నత స్థానాలకు ఎదుగుతారని అన్నారు. నియోజకవర్గంలోని 66 గ్రామాలు, 74 వార్డులలో ఇప్పటికే కమిటీల నియామకం పూర్తయిందని, పార్టీ కమిటీతోపాటు మహిళాకమిటీ, యూత్కమిటీ, మైనార్టీ కమిటీలను పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నామని పేర్కొన్నారు.
చాలా చోట్ల ఎన్నికలు ఏకగ్రీవంగా జరగడం శుభ పరిణామమని అన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ పాలన సాగుతోందని, అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను జనరంజకంగా సాగిస్తున్నారని అన్నారు. నోటి దురుసు నాయకులు వారి ఉనికి కోసం నీచమైన మాటలు మాట్లాడుతూ ప్రజల్లో మరింత చులకనగా తయారవుతున్నారని అన్నారు. వారి మాటలను ప్రజలు ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు.
ఈ సమావేశంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, ఎమ్మెల్యే తనయుడు విజిత్రావు, నాయకులు అత్తి సరోజ, గోగుల రవీందర్రెడ్డి, గాదెసత్యం, గొంగళ్ల శంకర్, తోట తిరుపతి, బొలిశెట్టి కిషన్, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.