హైదరాబాద్ : కరోనా సోకిన భార్యకు ధైర్యానిచ్చి అన్నివిధాలా అండగా నిలవాల్సిన భర్త ఆమె పట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. ఆమె ద్వారా తనకు కూడా కరోనా సోకుతుందేమోనన్న భయంతో వారంపాటు ఆమెను బాత్రూమ్లో బంధించాడు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో అనుమాష ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ వివాహితకు ఇటీవల కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో భర్త ఆమెను బాత్రూమ్లో బంధించాడు. వారంపాటు తినేందుకు భోజనం, తాగేందుకు కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదు. విషయాన్ని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇంటికి చేరుకొని ఆమెను రక్షించారు. అక్కడే ఓ గదిలో ఐసొలేషన్లో ఉంచారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.