మంచిర్యాల : జిల్లాలోని వేమనపల్లి మండలం రాచర్ల గ్రామానికి చెందిన చెన్నూరి అశ్వినికి సోమవారం తీవ్ర పురిటినొప్పులు వచ్చాయి. గ్రామస్తులు 108 కు సమాచారం ఇచ్చారు. 108 అంబులెన్సు సిబ్బంది రాచర్ల గ్రామానికి చేరుకున్నారు.
ఆ గ్రామం నుంచి చెన్నూరు ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా కోటపల్లి గ్రామ సమీపంలో తీవ్ర పురిటి నొప్పులు వచ్చాయి. 108 అంబులెన్సు సిబ్బంది స్పందించి సుఖ ప్రసవం చేశారు.
108 అంబులెన్సు సిబ్బంది వాహనాన్ని ఆపి జీవీకే ఈఎంఆర్ఐ ప్రధాన కార్యాలయ డాక్టర్ల తో సెల్ ఫోన్ లో సంప్రదించి సుఖ ప్రసవం చేశారు.
అశ్విని మగ బిడ్డకు జన్మించింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. వారికి మెరుగైన చికిత్స నిమిత్తం కోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి నట్టు ఈఎంటీ కత్రోజి ప్రవీణ్, పైలెట్ ఇమాం షరీఫ్ తెలిపారు.