మంచిర్యాల అర్బన్, నవంబర్ 25 : జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు చేర్చుతున్నారు. ప్రభుత్వం ‘ఏ’ గ్రేడ్ ధాన్యానికి రూ. 1960 చెల్లిస్తుండగా, సాధారణ రకానికి రూ. 1940 చెల్లిస్తున్నది. ఈ సమయంలో పండించిన ధాన్యానికి మద్దతు ధర పొందడానికి పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ రైతులకు పలు సూచనలు చేశారు.
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించే రైతులు ఏమైనా సందేహాలుంటే వ్యవసాయాధికారులను సంప్రదించాలి. అధికారుల సూచనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి రైతులు ప్రభుత్వ మద్దతు ధర పొందాలి.
-ప్రేమ్కుమార్, డీసీఎస్వో, మంచిర్యాల
గణనీయంగా తగ్గించాం..
నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోకుండా ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తేవడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. 2018లో 18శాతం ఉన్న నష్టాన్ని ఇప్పుడు 11శాతానికి తగ్గించాం. ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, ఫొటో వాట్సాప్ గ్రూపులో పంపితే చాలు పది నిమిషాల్లోనే సిబ్బంది అక్కడికి చేరుకుంటున్నారు. మరమ్మతులు చేసి, పూర్తి స్థాయి నష్టాన్ని పూర్తిగా నియంత్రించగలుగుతున్నాం.
పారదర్శకమైన సేవలు..
విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆన్లైన్ ఫిర్యాదు విభాగాన్ని అమలు చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్లకు గుర్తింపు నంబర్లను కేటాయించాం. అక్కడ ఏ సమస్య వచ్చినా ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే పరిష్కరించేందుకు కృషిచేయడం జరుగుతుంది. దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.
వెంటనే స్పందిస్తున్నారు.
పంట పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లలో సమస్య వచ్చినా, కాలిపోయినా ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే పది నిమిషాల్లోనే సిబ్బంది వస్తున్నారు. కాలిపోతే వారి సొంత వాహనంలోనే నిర్మల్కు తీసుకెళ్లి, కొత్తది తెచ్చి అమర్చుతున్నారు. ఓవర్లోడ్ ఉన్న చోట అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో కాలిపోతే రెండు నుంచి మూడురోజులు పట్టేది. ఇప్పుడు 24 గంటల్లోనే మంచిగ చేస్తున్నరు.