చెన్నూర్ : అర్హులైన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. చెన్నూర్లోని వ్యాక్సినేషన్ కేంద్రాలను గురువారం సందర్శించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. కొవిడ్ టీకాలపై అపోహలు వీడి, 18సంవత్సరాల పైబడిన వారంతా టీకాలు తీసుకోవాలని సూచించారు. వైద్య, ఆరోగ్య సిబంది తమ సమీపంలోకి వచ్చే టీకాలు అందిస్తున్నారని, అర్హులై ప్రతి ఒక్కరూ తప్పని సరిగా టీకా తీసుకోవాలని పేర్కొన్నారు.
కుటంబ యజమాని తాను టీకా తీసుకోవటంతో పాటుగా కుటుంబ సభ్యులందరికి టీకాలు ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపాల్ చైర్ పర్సన్ అర్చనా గిల్డా, వైస్ చైర్మన్ నవాజొద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయినుద్దీన్ , కౌన్సిలర్లు పాల్గొన్నారు.