మంచిర్యాల: జిల్లాలోని జన్నారం మండలంలో రామగుండం కమిషనరేట్ పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఆదివారం తెల్లవారుజామున మండలం మొర్రిగూడ, పూర్యానాయక్ తండాలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 54 వాహనాలు, రెండు ఆటోలను సీజ్ చేశారు. రెండు ఇండ్లలో నాటుసారా తయారీకి ఉపయోగించే ముడి సరుకు లభించడంతో దానిని స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని ఎక్సైజ్ శాఖ పోలీసులకు అప్పగించారు.