కోటపల్లి : ఆర్థిక ఇబ్బందులతో కార్పొరేట్ వైద్యం పొందలేని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరంలా పనిచేస్తుందని ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ అన్నారు. కోటపల్లి మండలం పారుపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ మండల నాయకులు పాలపులపు చంద్రుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.1.25 లక్షల చెక్కును ఎమ్మెల్సీ అందచేశారు. కరోనా బారిన పడిన చంద్రు వైద్య చికిత్సల కోసం దవాఖానలో ఉన్న సమయంలో రూ.50 వేల నగదు ఆర్థిక సహాయం అందచేసిన ఎమ్మెల్సీ, సీఎంఆర్ఎఫ్ నుంచి మరో రూ.1.25 లక్షలు మంజూరు చేయించి చెక్కు అందచేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్టీకి సైనికులుగా పనిచేసే ప్రతి కార్యకర్తకు, నాయకునికి పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పెద్దపోలు సాంబాగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బైస ప్రభాకర్, మల్లంపేట సర్పంచ్ అక్కల మధుకర్, మండల నాయకులు గట్టాగౌడ్, కుర్మ భీమాగౌడ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.