మంచిర్యాలటౌన్, మార్చి 16 : జిల్లా బోటిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గా న్ని మంగళవారం మంచిర్యాలలోని ఎం కన్వెన్షన్ హాలులో ఎన్నుకున్నారు. జిల్లాలో ని ఆయా పట్టణాలు, మండల కేంద్రాల్లో ఉన్న బోటిక్, మగ్గం వర్క్స్ దుకాణాల యజమానులంతా కలిసి ఈ అసోసియేషన్ను ఏర్పాటు చేసుకున్నారు. తమ సమస్యలతోపాటు వర్కర్స్, కస్టమర్ల సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ వారధిలా పనిచేస్తుందని సభ్యులు పేర్కొన్నారు. బోటిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలి గా మడుపు అరుణ, ప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శులుగా శ్రీనివాస్ లావణ్య, శివసాధన, గౌరవ అధ్యక్షురాలిగా సౌజన్య, గౌరవ సలహాదారుగా రాధ, సుష్మ, జ్యోతి, మల్లీశ్వరి, అనిత, తేజోమయి, నాగ, తదితరులు ఎన్నికయ్యారు.