మంచిర్యాల : బెల్లంపల్లి మున్సిపాలిటీ 30వ వార్డు కౌన్సిలర్గా టీఆర్ఎస్ అభ్యర్థి సుకేషిని భరద్వాజ్ ఏకగ్రీవంగా ఎంపికయ్యరు. వార్డు కౌన్సిలర్, సుకేషిని తల్లి కరుణాభాయ్ అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. కాగా ఉపఎన్నికలో ఇతర ఏ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు కాకపోవడంతో సుకేషిని ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఏకగ్రీవంగా ఎన్నికైన సుకేషినిని తన క్యాంప్ కార్యాలయంలో శాలువతో సత్కరించారు. మానవతా థృకదంతో ఎన్నికలలో సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్ ప్రజలకు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తుల శ్వేత, వైస్ చైర్పర్సన్ సుదర్శన్, కౌన్సెలర్లు, టీఆర్ఎస్ నాయకులు గెల్లి రాజలింగు, తడకా రవి పాల్గొన్నారు.