కాగజ్నగర్ ఆర్డీవో చిత్రు బెజ్జూర్లో పరిశీలన
బెజ్జూర్, మే : కరోనా కట్టడికి చేపట్టిన జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కాగజ్నగర్ ఆర్డీవో చిత్రు అన్నారు. మం డలకేంద్రంలో అధికారులు నిర్వహిస్తున్న సర్వేను మంగళవా రం పరిశీలించారు. ఇప్పటి వరకు జ్వరం, జలుబు, దగ్గు తదితర లక్షణాలతో బాధపడుతున్న ఎంతమందిని గుర్తించారని, అలాగే ఐసొలేషన్ కిట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి ఇంట్లోనే వైద్యం అందేలా చూడాలన్నారు. అనంతరం తహసీల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయని, ధరణిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా..? అని తహసీల్దార్ జమీర్ను అడిగారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. లక్షణాలతో వచ్చిన వారికే పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారి రుషికి సూచించా రు. అర్హులందరికీ టీకా వేయాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఏజెన్సీ భూముల క్రయ, విక్రయాలకు వీల్లేదు
కౌటాల, మే 25 : ఏజెన్సీలో గిరిజనేతరులకు భూముల క్రయ, విక్రయాలకు వీల్లేదని కాగజ్గనర్ ఆర్డీవో చిత్రు అన్నారు. బోదంపల్లి ప్రకృతి వనం కోసం కేటాయించిన స్థలం వివాదాస్పదం కావడంతో మంగళవారం తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ మునావర్ షరీఫ్, బోదంపల్లి సర్పంచ్ రెడ్డి శంకర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ గురుడుపేట శివారులోని సర్వే నంబర్ 40 పీపీలో బోదంపల్లికి చెందిన రాస్పల్లి భిక్షపతికి 11 ఎకరాలు భూమి ఉందన్నారు. అందులో నుంచి 20 గుంటల భూమిని బోదంపల్లి ప ల్లె ప్రకృతి వనానికి తీసుకున్నామన్నారు. అయితే భూమి తనదని అదే గ్రామానికే చెందిన పెరుగ హరిదాసు ఆ స్థలంలో ప్ర కృతి వనానికి కేటాయించిన స్థలంలో పనులను చేయనీయకుండా అడ్డుకుంటున్నాడని ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన మాట్లాడుతూ గురుడుపేట ఏజెన్సీ గ్రామం కావడంతో గిరిజనేతురులు భూములను అమ్మడం, కొనడం చేయడానికి వీలులేదన్నారు. రికార్డులను పరిశీలించి ఆ భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని తహసీల్దార్కు ఆర్డీవో చిత్రు సూచించారు. అలాగే మండలకేంద్రంలో ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన ధరణి గదిని పరిశీలించారు.