రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ
నీట మునిగిన కాలనీల సందర్శన
సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు
గర్మిళ్ల, జూలై 23 : భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయగా రాళ్లవాగు ఉద్రిక్తతతో మంచిర్యాల పట్టణ కేంద్రంలోని ఎన్టీఆర్నగర్, ఎల్ఐసీ కాలనీలోని ప్రజలు ధైర్యంగా, అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ సూచించారు. ఇళ్లలోకి అధికంగా నీరు ప్రవేశించడంతో అక్కడి పరిస్థితులను శుక్రవారం సీపీ సత్యనారాయణ, మంచిర్యాల డీసీపీ ఉదయ్కుమార్రెడ్డితో కలిసి సందర్శించా రు. మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తు న్న నేపథ్యంలో రాంనగర్, ఎల్ఐసీ కాలనీ, ఎన్టీఆర్నగర్ ప్రాంతాల్లో సుమారు కిలో మీటర్ వర కు ఇళ్లల్లోకి నీరు చేరిందన్నారు. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్, ప్రజా ప్రతినిధులు, డీసీపీ ఉదయ్కుమార్ రెడ్డి, పట్టణ సీఐ ముత్తి లింగ య్య, ఎస్ఐలు, స్పెషల్ పార్టీ సిబ్బంది, రెస్క్యూ సిబ్బందితో కలిసి సుమారు 70 మంది సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారన్నా రు. వరద పెరుగుతుందని, ముందస్తు సమాచా రం మేరకు కొంతమందిని ముందుగానే తరలించినట్లు తెలిపారు. ఇంకా రెండు రోజుల వరకు వర్షం ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న సూచన ల మేరకు నాలుగు టీంలు, మూడు స్పెషల్ పార్టీ బృందాలను రోప్స్, ఇతర పరికరాలతో ఎల్లప్పు డు అప్రమత్తంగాఉండేలా ఏర్పాటు చేశామన్నారు. లోతట్టు మారుమూల గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం కలిగిన అన్ని మార్గాల్లో పోలీ స్ అధికారులు పర్యటించి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో డయల్ 100కు ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో వచ్చి సహాయం అందించడానికి ప్రత్యేక రెస్క్యూ బృందాలు సిద్ధంగా ఉంటాయని తెలిపారు. సీపీ వెంట పట్టణ సీఐ ముత్తి లింగయ్య, ఎస్ఐలు ప్రవీణ్కుమార్, దేవయ్య, కిరణ్కుమార్, సిబ్బంది, తదితరులున్నారు.