సెయింట్ లూసియా: యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పొట్టి ఫార్మాట్లో 14 వేల పరుగుల మార్క్ దాటిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో గేల్ (38 బంతుల్లో 67; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) వీర విధ్వంసం సృష్టించడంతో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో గెలిచి.. ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన మూడో టీ20లో మొదట ఆసీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 141 పరుగులు చేయగా.. గేల్ జోరుతో విండీస్ 14.5 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 142 పరుగులు చేసి గెలిచింది.