సుల్తాన్బజార్, జులై 10: ఉద్యోగులతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉన్నదని టీఎన్జీఓ హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్హుస్సేనీ పేర్కొన్నారు. శనివారం తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానలో సుమారు 600మంది రోగులకు అన్నదానం చేయడంతో పాటు డాన్బాస్కో అనాథాశ్రమంలోని చిన్నారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం అబిడ్స్లోని ఆంజనేయస్వామి,నాంపల్లిలోని బంగారు మైసమ్మ ఆలయాల్లో ఉద్యోగులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 300మందికి అన్నదానం చేశారు. ఆ తరువాత జిల్లా శాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 75 కిలోల కేక్ను కట్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తానన్నారు. అనంతరం ఆయనను టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు ఎం. రాజేందర్, కార్యదర్శి ఆర్. ప్రతాప్, ఉపాధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, అసోసియేట్ అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్, కార్యదర్శి గరిగెబోయిన చంద్రశేఖర్, రామినేని శ్రీనివాస్రావు, నగర శాఖ అధ్యక్షుడు శ్రీరామ్, కార్యదర్శి కట్కూరి శ్రీకాంత్, టీఎన్జీఓ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్. విక్రమ్, ముజీబ్హుస్సేనీ సతీమణి సీమలు, అన్ని యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులు ఆయనను ఘనంగా సన్మానించారు.