జమ్మూకాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో ఏపీకి చెందిన హవాల్దార్ సీహెచ్ ప్రవీణ్ కుమార్ అమరులైన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన చీకాల ప్రవీణ్ కుమార్ రెడ్డి గత 18 ఏళ్లుగా భారత సైన్యంలోని మద్రాస్ రెజిమెంట్లో పనిచేస్తున్నారు. ఆ తర్వాత జమ్మూకాశ్మీర్లోని మాచిల్ సెక్టార్, నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వహిస్తుండగా, ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ప్రవీణ్ కుమార్ రెడ్డి అమరుడయ్యారు.
ప్రవీణ్ కుమార్ ఫ్యామిలీ ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. ఇప్పుడు మోహన్ బాబు కూడా తన వంతు చేయూత అందించేందుకు ముందుకు వచ్చారు. ప్రవీణ్కుమార్ కుమార్తె సీహెచ్ లోహితకు ఈ విద్యా సంవత్సరం 4వ తరగతి నుంచి ఉచితవిద్య అందించనున్నట్లు మోహన్బాబు తెలిపారు. సందర్భంగా ప్రవీణ్ కుమార్ భార్య శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల సీఈవో మంచు విష్ణుకు కృతజ్ఞతలు తెలియజేశారు.