ముంబై: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో బరిలోకి దిగుతున్న భారత ప్లేయర్లను ఉత్తేజపరిచే మరో గీతం మన ముందుకు రాబోతున్నది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, గాయకురాలు అనన్య బిర్లా ‘హిందుస్థానీ వే’ అనే గీతాన్ని స్వరపరిచారు. ఈ హిందీ గీతానికి అక్కడక్కడా ఇంగ్లిష్ పదాలు అద్ది మరింత ఊపు తీసుకొచ్చారు. ఈ పాట ద్వారా టీమ్ఇండియాకు మద్దతుగా నిలువడమే తమ ఉద్దేశమని రెహమాన్ పేర్కొన్నాడు.