కృష్ణా నది దేశంలోని నాలుగో అతి పెద్ద నది. మహారాష్ట్రలోని మహాబలేశ్వరం వద్ద పశ్చిమ కనుమలలో మొదలై, తర్వాత కర్ణాటక, తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ మీదుగా 1400 కిలోమీటర్లు ప్రయాణించి చివరిగా హంసలదీవివద్ద సముద్రంలో కలుస్తుంది. దాదాపు 2,58, 948 చదరపు కిలోమీటర్ల పరీవాహక ప్రాంతం ఉండగా అందులో తెలంగాణలో 58,004 (70%) చదరపు కిలోమీటర్లు కాగా, ఆంధ్రప్రదేశ్ పరీవాహక ప్రాంతం 24,832 (30%) చదరపు కిలోమీటర్లు మాత్రమే. నాలుగు రాష్ర్టాలలోని అన్ని ప్రాజెక్టుల్లో కలిపి 1054 టీఎంసీ నీటి నిల్వ ఉంది. కృష్ణ్ణా నది ప్రధాన ఉపనదులలో భీమా, డిండి, పాలేరు, మున్నేరు ప్రధానంగా తెలంగాణ నుంచి కలుస్తాయి. తుంగభద్ర కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణలలో ప్రవహిస్తుంది.
ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా నది జలాల వాడకంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం
డాక్టర్
బూర నర్సయ్య గౌడ్